మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం telugu పండుగలు   తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

చిలుకూరు బాలాజీ ఆలయం


హైదరాబాద్ లో శక్తివంతమైన చిలుకూరు బాలాజీ ఆలయం
చిలుకూరు బాలాజీ గురించిన అద్బుతమైన విషయాలు

చిలుకూరు బాలాజీ ఆలయ కథ విశ్వాసం మరియు శక్తి యొక్క కలయికతో కూడుకున్నది. ఎవరాకూ అర్థం కాదు. కానీ

నిజంగా సహాయం కోరి వచ్చిన భక్తులకు ఆ భగవంతుడు సహాయం చేస్తాడు.

ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహం ఒక స్వయంభు (స్వీయ వ్యక్తం) అని చెబుతారు. ఈ ఆలయంనకు ఆసక్తికరమైన పురాణం కూడా ఉంది.

హైదరాబాద్ లో శక్తివంతమైన చిలుకూరు బాలాజీ ఆలయం

నమ్మకం అనేది చాలా ఆసక్తికరమైన విషయం మరియు దానిని ఎవరూ పూర్తిగా విశ్లేషించలేరు. హైదరాబాద్ లోని

చిలుకూరు బాలాజీ ఆలయ కథ విశ్వాసం మరియు శక్తి యొక్క కలయికతో కూడుకున్నది. ఎవరాకూ అర్థం కాదు. కానీ

నిజంగా సహాయం కోరి వచ్చిన భక్తులకు ఆ భగవంతుడు సహాయం చేస్తాడు.

ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహం ఒక స్వయంభు (స్వీయ వ్యక్తం) అని చెబుతారు. ఈ ఆలయంనకు ఆసక్తికరమైన పురాణం కూడా ఉంది.

చిలుకూరు బాలాజీ ఆలయ పురాణం

పురాణాల ప్రకారం తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఇతను ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్లి స్వామిని దర్శించుకొనేవాడు. ఒక సమయంలో అతను అనారోగ్యం కారణంగా యాత్ర చేయలేదు. తనకు ఎంతో ఇష్టమైన దేవుని సందర్శించడానికి కుదరలేదని కలత చెందాడు. ఆ రాత్రి వెంకటేశ్వరస్వామి తన కలలో కనిపించి "నా భక్తులు ఎక్కడ వుంటే నేను అక్కడ వుంటాను. నా భక్తుల హృదయాలలోనే నేను కొలువై వుంటాను. నన్ను దర్శించుటకు తిరుపతికి వెళ్ళవలసినవసరం లేదని చెప్పాడు.

మరుసటి రోజు భక్తుడు అతను కలలో చూసిన స్థానానికి వెళ్లి ఒక పెద్ద రంధ్రం త్రవ్వడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా, అక్కడ రక్తం బయటకు కారడం మొదలయ్యింది. అది చూడగానే భక్తుడు భయపడ్డాడు. వెంటనే, ఒక స్వరం వినిపించింది. వెంకటేశ్వరస్వామి ఈ విధంగా భక్తునికి ఆవు పాలతో ఆ స్థలాన్ని పూరించమని అతనికి చెబుతాడు. ఆ భక్తుడు అదేవిధంగా చేస్తాడు. వెంటనే ఆశ్చర్యంగా శ్రీదేవి, భూదేవిలతో కొలువున్న బాలాజీ విగ్రహం అతనికి లభిస్తుంది.

ఆ తర్వాత లార్డ్ వెంకటేశ్వర విగ్రహాన్ని "చిలుకూరు" అనే గ్రామంలో ప్రతిష్టాపించారు. ఇప్పుడు హైదరాబాద్ అతిపురాతన ఆలయాల్లో "చిలుకూరు" ఒకటిగా నిలిచింది.

తిరుపతిలో గల లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క మరొక రూపం "చిలుకూరు బాలాజీ" అని ప్రజలు గట్టిగా నమ్ముతారు.

చిలుకూరు బాలాజీ గురించిన ఆసక్తికరమైన వాస్తవాలు:

1. భక్తులు భక్తితో "చిలుకూరు బాలాజీ" కి తమ కోరికలు విన్నవించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది.

2. భక్తులు గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ తమ కోరికలు చెప్పుకోవాలి. తమ కోరికలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. అందువల్ల చాలా మంది ప్రజలు చిలుకూరు ఆలయంలో భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ భక్తులు ఈ పురాతన ఆచారాన్ని అలాగే ఆచరిస్తున్నారు.

చిలుకూరు బాలాజీ ఆలయం ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా చిలుకూరు హైదరాబాద్ నుండి సుమారు 33కి.మీ ఉంది.

బస్సు మార్గం: మొదట హైదరాబాద్ నుండి మెహదీపట్నం చేరుకోవాలి. అక్కడనుండి చిలుకూర్ చేరుకోవచ్చు. బస్సు నెం. 288 డి ఈ మార్గంలో తరచుగా వెళ్తూ వుంటుంది.

ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ లో గల ఒక ప్రముఖ పవిత్ర ప్రదేశం. తిరుపతికి వెళ్ళడానికి కుదరని వారు ఇక్కడ "చిలుకూరు బాలాజీ టెంపుల్" ని దర్శించుకోవచ్చు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో గల ఇతర భక్తులు కూడా ఇక్కడకు వచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు. అందువల్ల ఇక్కడ 'వీసా బాలాజీ' అనే పేరు బాగా ప్రాచుర్యం పొందింది

 

 

     

 
       
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.